భర్త చెల్లిని ‘రెండో భార్య’గా చూపించి విడాకులు!

April 27, 2026 10:50 AM

మధ్యప్రదేశ్‌లోని Gwalior లో జరిగిన ఒక విచిత్రమైన విడాకుల కేసు ఇప్పుడు చర్చనీయాంశమైంది. 28 ఏళ్ల వివాహ బంధాన్ని ముగించేందుకు ఒక మహిళ, తన భర్త చెల్లినే అతని ‘రెండో భార్య’గా చూపిస్తూ కోర్టులో సాక్ష్యాలు సమర్పించింది.

1998లో వివాహం జరిగిన ఈ జంట మధ్య కాలక్రమేణా విభేదాలు పెరిగాయి. 2015 నుంచి ఇద్దరూ వేరుగా ఉంటుండగా, 2021లో మహిళ విడాకుల కోసం కుటుంబ కోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా, తన భర్త మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తూ ఒక కుటుంబ ఫోటోను సాక్ష్యంగా సమర్పించింది.ఆ ఫోటోలో భర్త పక్కన ఉన్న మహిళను ‘రెండో భార్య’గా పేర్కొనడంతో, కోర్టు ఆమె వాదనను సమర్థించి ఎక్స్‌పార్టీగా విడాకులు మంజూరు చేసింది. అయితే తర్వాత ఆ ఫోటోలో ఉన్నది తన చెల్లేనని భర్త వెల్లడిస్తూ, ఈ తీర్పును Madhya Pradesh High Court గ్వాలియర్ బెంచ్‌లో సవాలు చేశాడు.తనకు వాదించే అవకాశం ఇవ్వకుండా, తప్పుడు సమాచారంతో తీర్పు పొందిందని భర్త ఆరోపించగా, ప్రస్తుతం హైకోర్టు ఈ కేసును విచారిస్తోంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media