Penchalakona లోని ప్రసిద్ధ Sri Penusila Lakshmi Narasimha Swamy Temple లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేడు (ఏప్రిల్ 27) ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు మే 13 వరకు భక్తిశ్రద్ధలతో కొనసాగనున్నాయి.

ఉత్సవాల ప్రారంభంలో భాగంగా గోనుపల్లి నుంచి శ్రీవారి ఉత్సవమూర్తులను శోభాయాత్రగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం స్నపన తిరుమంజనం, ప్రత్యేక పుష్పాలంకరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఏప్రిల్ 28న ధ్వజారోహణంతో ప్రధాన ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

తదుపరి రోజుల్లో శేషవాహన సేవ, హంసవాహన సేవ, బంగారు హనుమంతు సేవ, గరుడసేవ, శ్రీవారి కళ్యాణం, చక్రస్నానం, తెప్పోత్సవం వంటి ముఖ్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చివరి రోజున ఉత్సవమూర్తులు గోనుపల్లికి తిరిగి వెళ్లి గ్రామోత్సవాలు జరుగుతాయి.భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.
