చిత్తూరు జిల్లాలోని V. Kotaలో విలేకరి హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. Andhra Jyothyకు చెందిన విలేకరి జగన్మోహన్ రెడ్డి, వాకింగ్కు వెళ్లిన సమయంలో దుండగులు వెంటాడి కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేసినట్లు సమాచారం.

దాడి సమయంలో ప్రాణాలు కాపాడుకునే అవకాశమూ లేకుండా అక్కడికక్కడే ఆయన మృతి చెందారు. ఈ ఘటనపై జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
