గుంటూరు నగరంలో పెట్రోల్, డీజిల్ కొరతపై నిరసనలు వ్యక్తమయ్యాయి. వైసీపీ ఎమ్మెల్సీ Lella Appi Reddy ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇంధన కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వ్యాపార, వాణిజ్య రవాణా పూర్తిగా స్థంభించిందని వారు ఆరోపించారు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ఇలాంటి పరిస్థితులు ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు.ఈ సమస్యకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ, తక్షణమే పెట్రోల్, డీజిల్ సరఫరాను పునరుద్ధరించాలని నిరసనకారులు కోరారు.
