సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ను మాజీ మంత్రి T. Harish Rao పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం Revanth Reddyపై తీవ్ర విమర్శలు చేశారు.

ఫేక్ పోస్టులు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా, ఆధారాలతో ఫిర్యాదు చేసిన క్రిశాంక్ను అరెస్టు చేయడం పూర్తిగా కక్షసాధింపేనని హరీశ్ రావు ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు, సిట్ల ద్వారా అణచివేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.
కొంతమంది ఐపీఎస్ అధికారులు బెంగళూరుకు చెందిన ప్రైవేట్ హ్యాకర్లను ఉపయోగించి ఫోన్లు, సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారనే సంచలన ఆరోపణలు కూడా చేశారు. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులపై భవిష్యత్తులో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రైతుల సమస్యలపై కూడా స్పందించిన హరీశ్ రావు, కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సన్నవడ్లకు బోనస్ అంశంపై సీఎం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.క్రిశాంక్పై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
