తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. టీవీకే అధినేత విజయ్ కు ఎన్నికల అనంతరం కాంగ్రెస్ నాటకీయంగా మద్దతు ఇవ్వడాన్ని సమర్థించారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం. అయితే విజయ్ ఎదుగుదల స్థాయిని అంచనా వేయడంలో తమిళనాడు రాజకీయ వ్యవస్థ విఫలమైందని చిదంబరం అంగీకరించారు.తమిళనాడులో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కొత్తగా పుట్టుకొస్తున్న ద్రవిడేతర శక్తి చేసిన మొదటి విజయవంతమైన ప్రయత్నంగా చిదంబరం విజయ్ సాధించిన ఈ విజయాన్ని అభివర్ణించారు.
ఎన్నికలకు ముందు అన్ని వర్గాల పార్టీలు విజయ్ను తక్కువగా అంచనా వేశాయని చిదంబరం అంగీకరించారు. సమిష్టిగా, మొత్తం రాజకీయ వ్యవస్థ విజయ్ ఇంత బాగా రాణిస్తారని అనుకోలేదని ఆయన అన్నారు. యువత, మహిళా ఓటర్లలో విజయ్కు ఉన్న ఆదరణ, దానికి తోడు సోషల్ మీడియా విపరీతంగా పెరగడం వంటివి ఫలితంలో నిర్ణయాత్మక పాత్ర పోషించాయన్నారు. ప్రతి వర్గానికి చెందిన మహిళలు ఆయనకు ఓటు వేశారు. కానీ యువత చాలా పెద్ద సంఖ్యలో ఓటు వేశారని తాను భావిస్తున్నానని చిదంబరం అన్నారు.
