బీసీ వృత్తిదారులకు ఉచిత కరెంట్‌

May 20, 2026 5:00 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ, ఎంబీసీ వర్గాలకు చెందిన వృత్తిదారులు, బీసీఎల్ కుటుంబాలకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. బీసీ వర్గాల జీవనోపాధి మెరుగుపర్చే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

రజకులు, స్వర్ణకారులు, నాయీ బ్రాహ్మణులు, అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇవ్వనుంది.

వర్గాల వారీగా ఉచిత యూనిట్లు

  • సెలూన్లు (నాయీ బ్రాహ్మణులు) – 200 యూనిట్లు
  • లాండ్రీ షాపులు (రజకులు) – 150 యూనిట్లు
  • గోల్డ్ షాపులు (స్వర్ణకారులు) – 100 యూనిట్లు
  • తెల్ల రేషన్ కార్డు ఉన్న గృహాలు – 100 యూనిట్లు

అర్హులైన లబ్ధిదారులు సంబంధిత పత్రాలతో ఏపీఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజినీర్ (AE) కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

అవసరమైన పత్రాలు

  1. ఆధార్ కార్డు
  2. రేషన్ కార్డు
  3. కుల ధృవీకరణ పత్రం
  4. ప్రస్తుత కరెంట్ బిల్లు లేదా సర్వీస్ నంబర్
  5. ఎస్టాబ్లిష్‌మెంట్ సర్టిఫికేట్

అత్యంత వెనుకబడిన వర్గాల్లోని దాసరి, దొమ్మర, జంగం, జోగి, దమ్మలి, ముత్యాలమ్మవాండ్లు సహా 32 ఉపకులాలకు చెందిన లబ్ధిదారులకు ఎస్టాబ్లిష్‌మెంట్ సర్టిఫికేట్ అవసరం లేదని అధికారులు తెలిపారు.

అర్హులైన వృత్తిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media