రుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. విద్యాసంస్థలకు మరికొద్దిరోజుల్లో వేసవి సెలవులు ముగియనుండటంతో శ్రీవారి దర్శనానికి భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. బుధవారం మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకూ సర్వదర్శనం క్యూ లైన్ ను టీటీడీ అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. తిరిగి రాత్రి 8 గంటల నుంచి క్యూలైన్లోకి భక్తులను అనుమతించగ. గురువారం ఉదయం 7 గంటల సమయానికి కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి.
సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు స్వామివారి దర్శనానికి 6-7 గంటల సమయం పడుతోంది. రూ.300 శీఘ్రదర్శనానికి 4-5 గంటల సమయం పడుతోంది. బుధవారం స్వామివారిని 86,315 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే స్వామివారికి 44,107 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో స్వామివారి హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు సమకూరింది.

