మొత్తం లీక్ అవ్వలేదు.. ప్రశ్నలు మాత్రమే బయటకు వచ్చాయి

May 22, 2026 9:18 AM
nta neet leak

నీట్-యూజీ 2026 పరీక్ష పేపర్ పూర్తిగా లీక్ కాలేదని, కేవలం కొన్ని ప్రశ్నలు మాత్రమే బయటకు వచ్చాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తెలిపింది. ఇటీవలి నీట్ వివాదంపై విచారణ జరుపుతున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు హాజరైన ఎన్‌టీఏ అధికారులు ఈ మేరకు వివరణ ఇచ్చారు. పరీక్షలో అక్రమాలు, అవకతవకలు జరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ, దీనిని పూర్తిస్థాయి పేపర్ లీక్‌గా పరిగణించలేమని వారు కమిటీకి తెలిపారు. అవకతవకల విషయంలో తమది జీరో-టాలరెన్స్ విధానమని, అందుకే విద్యార్థుల్లో విశ్వాసం దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే పరీక్షను రద్దు చేయాల్సి వచ్చిందని ఎన్‌టీఏ అధికారులు పేర్కొన్నారు.

రద్దు చేసిన నీట్-యూజీ పరీక్షను జూన్ 21న తిరిగి నిర్వహించనున్నట్టు ఎన్‌టీఏ ప్రకటించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5:15 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం గానీ, అదనపు ఫీజు చెల్లించడం గానీ అవసరం లేదని, పాత రిజిస్ట్రేషన్లే చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటివరకు రాజస్థాన్, హరియాణా, మహారాష్ట్రలలో 9 మందిని అరెస్ట్ చేసింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media