ముదురుతున్నCBSE–OSM టెండర్ వివాదం

June 1, 2026 11:03 AM

‘ఫోన్‌తో స్కాన్ చేసిన జవాబు పత్రాలు’ అంటూ రాహుల్ గాంధీ ఆరోపణ

మూల్యాంకన విధానంపై ప్రశ్నలు

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) జవాబు పత్రాల డిజిటైజేషన్‌కు సంబంధించిన OSM (On-Screen Marking) టెండర్ వివాదం మరింత ముదురుతోంది. ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ Rahul Gandhi స్పందిస్తూ, విద్యార్థుల జవాబు పత్రాలను ఫోన్‌లతో స్కాన్ చేసే విధానాన్ని అనుమతిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

సీబీఎస్‌ఈ చేపట్టిన టెండర్ ప్రక్రియలో నాణ్యత, పారదర్శకత, డేటా భద్రతపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పరీక్షల నిర్వహణలో రాజీ పడకూడదని అన్నారు.

డేటా భద్రతపై ఆందోళన

జవాబు పత్రాలను సాధారణ మొబైల్ ఫోన్‌లతో స్కాన్ చేసే అవకాశం కల్పిస్తే విద్యార్థుల వ్యక్తిగత సమాచారం, పరీక్షల గోప్యత ప్రమాదంలో పడే అవకాశముందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. విద్యా వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం అవసరమే అయినా, భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు.

ఈ టెండర్‌కు సంబంధించిన అర్హత నిబంధనలు, సాంకేతిక ప్రమాణాలపై ఇప్పటికే వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వివాదం పెరుగుతున్న నేపథ్యంలో సీబీఎస్‌ఈ నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media