చివరి ఫోన్ కాల్లో భార్యకు ధైర్యం చెప్పిన Suresh patnala
15వ వివాహ వార్షికోత్సవానికి ఇంటికి రావాల్సి ఉండగా విషాదం
విశాఖపట్నం:
“జాగ్రత్తగా ఉండండి” అని భర్త Suresh patnala కు భార్గవి సురేశ్ చివరిసారిగా చెప్పింది. “నేను జాగ్రత్తగానే ఉన్నాను” అని ఆయన సమాధానం ఇచ్చారు. జూన్ 9న జరిగిన ఆ సంభాషణే వారిద్దరి మధ్య చివరిది అయింది. రెండు రోజుల తర్వాత ఒమాన్ తీరంలో సురేశ్ కనిపించకుండా పోయారని వచ్చిన వార్తతో భార్గవి తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన 44 ఏళ్ల మెరైన్ ఇంజినీర్ సురేశ్ పట్నాల, ఒమాన్ తీరంలో జూన్ 9న ఎంటీ సెట్టెబెల్లో (MT Settebello) వాణిజ్య నౌకపై జరిగిన అమెరికా సైనిక దాడిలో మృతి చెందిన ముగ్గురు భారతీయ సిబ్బందిలో ఒకరు.
భార్గవి (39) మాట్లాడుతూ, “మా పిల్లలు ఇద్దరూ చిన్నవాళ్లు. వారికి 10, 13 ఏళ్లు. ఇప్పుడు వారిని ఎవరు చూసుకుంటారు? నేను గృహిణిని. ఉద్యోగానికి వెళ్లలేను. పిల్లలను ఎలా పెంచాలి?” అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్రిక్త పరిస్థితుల గురించి చెప్పిన భర్త
చివరిసారిగా మాట్లాడినప్పుడు ఆ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల గురించి సురేశ్ చెప్పారని భార్గవి తెలిపారు.
“ఉద్యోగం వదిలేసి ఇంటికి వచ్చేయాలని కొన్ని సందర్భాల్లో నేను చెప్పాను. కానీ కుటుంబానికి మంచి జీవితం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన ఉద్యోగంలో కొనసాగారు. ఇప్పుడు మా కలలన్నీ చెల్లాచెదురయ్యాయి” అని భార్గవి కన్నీటి పర్యంతమయ్యారు.
పిల్లల చదువు బాధ్యత తీసుకోవాలని డిమాండ్
కుటుంబానికి సురేశ్ జీతమే ప్రధాన ఆదాయ వనరు అని భార్గవి చెప్పారు.
“వివాహానికి ముందు ఆరు సంవత్సరాలు ఒక ప్రైవేటు సంస్థలో పనిచేశాను. ఇప్పుడు నాకు ఉద్యోగం దొరకడం లేదు. ఆయనను అక్కడికి పంపిన సంస్థ మా పిల్లల చదువు బాధ్యత తీసుకోవాలి. వారికి మంచి విద్య చాలా అవసరం” అని కోరారు.
“కంపెనీ, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం కోసం ఎదురుచూస్తున్నాం” అని భార్గవి చెప్పారు.
Also read,



