దొడ్డ గణేష్ ఘాటు కౌంటర్.. సోషల్ మీడియాలో వైరల్
సచిన్ vs కోహ్లీ.. ఏబీడీ ఏమన్నాడంటే?
Sachin vs Kohli: భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల మధ్య పోలిక పెడుతూ సౌతాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.
విదేశీ పిచ్లపై సచిన్ కంటే విరాట్ కోహ్లీనే మెరుగ్గా ఆడాడని ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు.
యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన డివిలియర్స్.. సీమ్, బౌన్స్కు అనుకూలించే కఠినమైన విదేశీ పరిస్థితుల్లో సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లీ మెరుగైన ప్రదర్శన ఇచ్చాడని చెప్పాడు.
ఉపఖండపు బ్యాటర్లు విదేశీ పిచ్లపై పరుగులు చేయగలరని సచిన్ ముందుగా నిరూపించాడని, అయితే విరాట్ ఆ ప్రమాణాలను మరో స్థాయికి తీసుకెళ్లాడని వ్యాఖ్యానించాడు.
విరాట్ ప్రదర్శన సచిన్ను మించిపోయిందన్న ఏబీడీ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
దొడ్డ గణేష్ ఘాటు కౌంటర్
డివిలియర్స్ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ పేసర్ దొడ్డ గణేష్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించాడు.
ఏబీడీ కామెంట్స్కు కౌంటర్ ఇస్తూ.. “కొంచెం ఆ గంజాయిని పక్కన పెట్టు బ్రదర్” అంటూ ఎక్స్లో వ్యంగ్యంగా పోస్ట్ చేశాడు.
విదేశాల్లో పేస్, బౌన్స్కు అనుకూలించే కఠినమైన పిచ్లపై సచిన్ సాధించిన రికార్డులు, ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్లను మర్చిపోయి ఇలా మాట్లాడటం సరికాదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
దొడ్డ గణేష్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కేఎల్ రాహుల్పైనా ఏబీడీ కామెంట్స్
డివిలియర్స్ తన వ్యాఖ్యల్లో సచిన్, విరాట్లతో పాటు ప్రస్తుత తరం ఆటగాళ్ల గురించి కూడా మాట్లాడాడు.
సచిన్, విరాట్ చూపించిన దారిలోనే కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్ వంటి యువ ఆటగాళ్లు పయనిస్తున్నారని చెప్పాడు.
అయితే విదేశీ గడ్డపై కేఎల్ రాహుల్ మరింత మెరుగ్గా ఆడాల్సి ఉందని డివిలియర్స్ సూచించాడు.
రాహుల్కు మంచి టెక్నిక్ ఉన్నప్పటికీ.. విదేశాల్లో అతని సగటు 34గా ఉందని గుర్తుచేశాడు.
రాహుల్ సెంచరీలను 180 ప్లస్ భారీ స్కోర్లుగా మలచగలిగితే మరింత గొప్ప ఆటగాడిగా ఎదగొచ్చని విశ్లేషించాడు.



