కొండా సురేఖ పోస్ట్తో తెలంగాణ రాజకీయాల్లో చర్చ
Telangana: మాజీ మంత్రి, కాంగ్రెస్ MLA Konda Surekha సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్ట్ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని పెంచింది. “ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలో నిర్ణయం ప్రకటిస్తా” అంటూ ఆమె చేసిన పోస్టుతో తదుపరి అడుగు ఏంటి? అనే చర్చ మొదలైంది.
కాంగ్రెస్లోనే కొనసాగుతారా? కొత్త నిర్ణయం తీసుకుంటారా?
మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత కొండా సురేఖ గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోనని, ఎమ్మెల్యేగా కొనసాగుతూ తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని స్పష్టం చేశారు.
అయితే తాజాగా ఆమె చేసిన “త్వరలో నిర్ణయం ప్రకటిస్తా” అనే పోస్టు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
ఆమె తన నిర్ణయంపై పునరాలోచన చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో కొండా మురళి చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు Konda Surekha చేసిన తాజా పోస్ట్ నేపథ్యంలో కొండా కుటుంబం కాంగ్రెస్లోనే కొనసాగుతుందా? లేదా మరో నిర్ణయం తీసుకుంటుందా? అనే ఉత్కంఠ నెలకొంది.



