ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ వారి నిత్య అన్నదాన పథకానికి భక్తులు భారీ విరాళం అందజేశారు. విజయవాడ భవానీపురానికి చెందిన కె. వెంకట సుదర్శన రావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రూ. 1,11,116/- విరాళాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి (EO) శీనానాయక్కు చెక్కు రూపంలో అందజేశారు.విరాళం అందించిన దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేయగా, ఈఓ వారికి అమ్మవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలను అందజేసి సత్కరించారు.
