ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో ‘గజేంద్ర మోక్షం’ ఘట్టం అత్యంత వైభవంగా జరిగింది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా స్వామివారు రామావతారంలో అలంకృతులై కొండ దిగువన ఉన్న పూల తోట వద్దకు ఊరేగింపుగా వేంచేశారు. పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం గజేంద్రుడిని ఆపద నుండి కాపాడిన ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
వేలాదిగా తరలివచ్చిన భక్తులతో సింహాద్రి క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
