world :ప్రపంచ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ

January 20, 2026 4:55 PM

ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా మంగళవారం జరిగిన ‘భారత్ కేంద్రంగా అభివృద్ధి- ఏపీ సానుకూలతలు’ అనే అంశంపై భారత పరిశ్రమల సమాఖ్య (CII) నిర్వహించిన బ్రేక్ ఫాస్ట్ సెషన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రపంచస్థాయి కంపెనీల సీఈవోలతో భేటీ అయిన ఆయన, నవ్యాంధ్రను పెట్టుబడుల స్వర్గధామంగా తీర్చిదిద్దే తన విజన్‌ను పంచుకున్నారు.
“దావోస్ నాకు కొత్త ఆలోచనల వేదిక. ఇక్కడి పారిశ్రామికవేత్తల ఆలోచనలను అర్థం చేసుకుని, ఏపీని వ్యాపారాలకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా మారుస్తున్నాం.”

భారత్ వద్ద మరే దేశానికీ లేని యువశక్తి ఉంది. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో తెలుగువారు ఎప్పుడూ ముందే ఉంటారని, నాలెడ్జ్ ఎకానమీ ద్వారా సంపద సృష్టి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. “గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (Ease of Doing Business) గురించి మాట్లాడాం.. ఇప్పుడు మా నినాదం ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ (Speed of Doing Business). కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ పరుస్తుంది.” వ్యవసాయం, వైద్య రంగాల్లో డ్రోన్ల వాడకంపై ఏపీ దృష్టి పెట్టిందని, 2026 మే నెలలో డ్రోన్ అంబులెన్స్ ప్రారంభించబోతున్నామని సంచలన ప్రకటన చేశారు. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే రావడం గర్వకారణమన్నారు. 1000 కి.మీ తీరప్రాంతం, పోర్టులు, ఎయిర్ పోర్టులు ఏపీకి ఉన్న సహజ బలాలు అని వివరించారు. వచ్చే 3-4 ఏళ్లలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media