తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మరో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో ఆయన తన ఎగ్జిక్యూటివ్ విద్యా కార్యక్రమాన్ని శుక్రవారం (జనవరి 30, 2026) విజయవంతంగా పూర్తి చేశారు.

“21వ శతాబ్దంలో నాయకత్వం: గందరగోళం, సంఘర్షణ మరియు ధైర్యం” (Leadership in the 21st Century: Chaos, Conflict, and Courage) అనే అంశంపై ముఖ్యమంత్రి ప్రత్యేక శిక్షణ పొందారు. అమెరికాలో మంచు తుఫాను కారణంగా -15 నుండి -24 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ, రేవంత్ రెడ్డి ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు క్రమం తప్పకుండా తరగతులకు హాజరయ్యారు.

20కి పైగా దేశాల నుండి వచ్చిన 62 మంది ప్రతినిధులతో కలిసి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాధారణ విద్యార్థిలాగే అసైన్మెంట్లు, కేస్ స్టడీలు మరియు గ్రూప్ డిస్కషన్లలో చురుగ్గా పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రి పదవిలో ఉండి, ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ ఐవీ లీగ్ (Ivy League) సంస్థ నుండి ఇటువంటి సర్టిఫికెట్ అందుకున్న తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రికార్డు సృష్టించారు. కార్యక్రమ ముగింపు సందర్భంగా హార్వర్డ్ అధ్యాపక బృందం రేవంత్ రెడ్డికి అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని అందజేసింది.

