ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మహాజాతర మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ అమ్మవార్లను దర్శించుకున్నారు. సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, జాతర భద్రతా ఏర్పాట్లపై క్షేత్రస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
DGPమేడారం చేరుకుని సమ్మక్క-సారలమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజారులు ఆయనకు ఘనస్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. గద్దెల వద్ద భక్తుల క్యూలైన్లు, ట్రాఫిక్ నియంత్రణ మరియు పార్కింగ్ ప్రాంతాలను డీజీపీ స్వయంగా పరిశీలించారు. రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, క్రమశిక్షణతో కూడిన భద్రతను అందించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సాంకేతికతను వాడుకుంటూ క్రౌడ్ మేనేజ్మెంట్ (Crowd Management) చేయాలని దిశానిర్దేశం చేశారు. కోట్లాది మంది భక్తులు వచ్చే ఈ జాతరను అత్యంత ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి పోలీస్ అధికారి అంకితభావంతో పనిచేయాలని డీజీపీ పేర్కొన్నారు.
