తెలంగాణలోని మెడికల్ పీజీ అభ్యర్థులకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (KNRUHS) కీలక ప్రకటన చేసింది. రెండో విడత మేనేజ్మెంట్ కోటాలో మెడికల్ పీజీ, డిప్లొమా సీట్లు పొందిన అభ్యర్థుల రిపోర్టింగ్ గడువును మరో రెండు రోజులు పొడిగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

పాత గడువు: ఫిబ్రవరి 02, 2026 (సోమవారం).
కొత్త గడువు: ఫిబ్రవరి 04, 2026 వరకు.
రెండో విడత మేనేజ్మెంట్ కోటా (Management Quota) కింద ప్రవేశాలు పొందిన అభ్యర్థులకు మాత్రమే.అభ్యర్థులు ఈ నెల 4వ తేదీ సాయంత్రం 4:00 గంటలలోపు తమకు కేటాయించిన మెడికల్ కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లు, బాండ్లు మరియు ఫీజుతో రిపోర్ట్ చేయాలని వర్సిటీ స్పష్టం చేసింది. రిపోర్టింగ్ చేయని పక్షంలో వారి సీటు రద్దవుతుందని హెచ్చరించింది.
