ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం ప్రొద్దుటూరు పట్టణంలో పర్యటించారు. ప్రొద్దుటూరు – మైదుకూరు రోడ్డులో ఉన్న AR&BCVR ట్రావెల్స్ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రికి, సంస్థ యాజమాన్యం ఘన స్వాగతం పలికింది.
AR&BCVR ట్రావెల్స్ యజమానులు శ్రీనివాసులు రెడ్డి, సురేష్ రెడ్డి, సూర్య ప్రతాప్ రెడ్డిల ఆహ్వానం మేరకు విచ్చేసిన మంత్రిని సంస్థ తరఫున శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా రవాణా రంగంలోని ప్రస్తుత పరిస్థితులు, ట్రావెల్స్ ఆపరేటర్ల సమస్యలపై మంత్రి యాజమాన్యంతో కాసేపు ముచ్చటించారు. రవాణా రంగాన్ని మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాల సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు మరియు ట్రావెల్స్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
