AI modelsపై కేంద్రం Alert: సైబర్ దాడులపై హై లెవల్ Meeting

April 24, 2026 11:45 AM

అడ్వాన్స్‌డ్ ఏఐ టెక్నాలజీ వల్ల వచ్చే సైబర్ ముప్పులపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా Anthropic సంస్థకు చెందిన “Mythos” వంటి మోడల్స్ సాఫ్ట్‌వేర్ లోపాలను గుర్తించి సైబర్ దాడులకు ఉపయోగపడే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి Nirmala Sitharaman మరియు ఐటీ మంత్రి Ashwini Vaishnaw ఆధ్వర్యంలో హై లెవల్ సమావేశం జరిగింది. ఈ ముప్పును “అపూర్వమైనది”గా అభివర్ణించిన సీతారామన్, బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు తమ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు.ఏవైనా సైబర్ ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే CERT-In కు సమాచారం ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. ఫిన్‌టెక్ రంగంలో ఏఐ వృద్ధికి సహకరిస్తున్నప్పటికీ, డేటా ప్రైవసీ మరియు భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media