Delhi నుంచి Goaకు వెళ్తున్న AirAsia విమానంలో ఓ ప్రయాణికుడు వాష్రూమ్లో బీడీ తాగిన ఘటన కలకలం రేపింది.

ఆశిష్ అనే ప్రయాణికుడు విమాన వాష్రూమ్లో బీడీ కాలుస్తుండగా ఎయిర్ హోస్టెస్ గమనించారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత సిబ్బంది ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.విమానంలోకి గ్యాస్ లైటర్తో ప్రయాణికుడు ఎలా ప్రవేశించాడన్న అంశం ఇప్పుడు భద్రతా పరంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
