1937 కాంగ్రెస్ నిర్ణయానికే కట్టుబడి
కర్ణాటక ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఇకపై ‘వందేమాతరం’ గేయంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలపిస్తామని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, సీఎం స్థాయి నాయకుడు డీకే శివకుమార్ స్పష్టం చేశారు.
ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉంటామని చెప్పారు.
1937లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో ‘వందేమాతరం’లోని మొదటి రెండు చరణాలను మాత్రమే పాడాలని తీర్మానించారని డీకే శివకుమార్ తెలిపారు.
ఆ విధానాన్నే కొనసాగిస్తామని చెప్పారు.
ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘వందేమాతరం’ ఆరు చరణాలు ఆలపించడంపై ఆయన స్పందించారు.
అది తనకు తెలియకుండానే జరిగిపోయిందని వివరణ ఇచ్చారు.
అందరినీ కలుపుకొని ముందుకు సాగుతాం
దేశంలో భిన్న సంస్కృతులు, మతాలకు చెందిన ప్రజలు ఉన్నారని డీకే శివకుమార్ అన్నారు.
అందరినీ కలుపుకొని ముందుకు సాగడమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని చెప్పారు.
పాలనలో అన్ని వర్గాలను సమానంగా గౌరవించడం తమ నైతిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయడమే తమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.
సూర్యుడు, చంద్రుడు, గాలికి మతం లేదు
హిందూ వర్సెస్ హిందుత్వవాదంపై జరుగుతున్న రాజకీయ చర్చను కూడా డీకే శివకుమార్ ప్రస్తావించారు.
సూర్యుడు, చంద్రుడు, గాలి, నీటికి ఎలాంటి మతం ఉండదని ఆయన ఉద్ఘాటించారు.
అదే విధంగా ప్రభుత్వం కూడా మతాలకు అతీతంగా అందరినీ సమానంగా గౌరవిస్తూ పాలన సాగిస్తుందని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.



