కడప జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతపై డీవైఎఫ్ఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జిల్లా కార్యదర్శి Veeranala Shivakumar జమ్మలమడుగులో మీడియాతో మాట్లాడుతూ, ఇంధన కొరతను కృత్రిమంగా సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జిల్లాలో 234 పెట్రోల్ బంకులు ఉన్నప్పటికీ, కొన్ని బంకులు ‘నో స్టాక్’ బోర్డులు పెట్టి మూసివేయడం వల్ల ప్రజలు గంటల తరబడి ఇంధనం కోసం వేచి చూడాల్సి వస్తోందని తెలిపారు. సరిపడా పెట్రోల్ ఇవ్వకుండా పరిమితులు విధించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.ఆయిల్ కంపెనీలు మరియు బంక్ యజమానుల మధ్య ఆర్థిక సమస్యల కారణంగా సరఫరా తగ్గిందని, ధరలు పెరిగే అవకాశాన్ని కారణంగా చూపుతూ ఇంధనం నిల్వ ఉంచుతున్నారనే ఆరోపణలు చేశారు.ఈ పరిస్థితి వల్ల చిన్న వ్యాపారాలు చేసే ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, రెవెన్యూ అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
