ఋషికొండలోని గీతం యూనివర్శిటీ వద్ద వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కనీసం 25% ఫీజు రాయితీ కల్పించాలని, అలాగే గీతం యూనివర్శిటీ అక్రమంగా ఆక్రమించుకున్నట్లు ఆరోపణలు ఉన్న ప్రభుత్వ భూములను కాపాడాలని వారు డిమాండ్ చేశారు.

యూనివర్శిటీ గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపిన నాయకులు, ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా అధ్యక్షుడు కెకె రాజు సహా పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
