KT Rama Rao పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు Danam Nagender మరియు Kadiyam Srihariలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని తీవ్రంగా విమర్శించారు.
ఇది ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ బీఫామ్పై ఎమ్మెల్యేగా గెలిచి, తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజల తీర్పును అవమానించడమేనన్నారు.స్పీకర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించిన కేటీఆర్, ఇది కేవలం ఒక తీర్పు మాత్రమే కాదని, అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగిస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో సమాధానం చెబుతారని కేటీఆర్ పేర్కొన్నారు.
