బుల్లెట్ ట్రైన్‌లో ‘Made in India’ విప్లవం..

April 27, 2026 11:30 AM

భారత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో కీలక ముందడుగు పడింది. ఇకపై హై-స్పీడ్ రైల్ కోచ్‌ల తయారీలో దేశీయ సాంకేతికతకు ప్రాధాన్యం పెరుగుతోంది. BEML ఆధ్వర్యంలో బెంగళూరులోని ఆదిత్య ప్లాంట్‌లో బుల్లెట్ ట్రైన్‌కు అవసరమైన B-28 కోచ్‌లను తయారు చేయనున్నారు.

ఈ అత్యాధునిక తయారీ యూనిట్‌ను కేంద్ర రైల్వే మంత్రి Ashwini Vaishnaw ప్రారంభించారు. ఇప్పటివరకు విదేశీ టెక్నాలజీపై ఆధారపడిన భారత్, ఇప్పుడు స్వదేశీంగా హై-స్పీడ్ రైల్ కోచ్‌లను తయారు చేసే దిశగా అడుగులు వేస్తోంది.ప్రత్యేకంగా హై-స్పీడ్ ట్రైన్ల కోసం డిజైన్ చేసిన ఈ ప్లాంట్, దేశంలో రైల్వే రంగానికి గేమ్‌చేంజర్‌గా భావిస్తున్నారు. బుల్లెట్ ట్రైన్ ప్రారంభంతో సిటీల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి, ఆర్థిక వ్యవస్థ, ఉపాధి అవకాశాలు, కనెక్టివిటీ విస్తృతంగా మెరుగుపడనున్నాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media