ప్రతి చిన్న అవసరానికీ ఆన్లైన్ సేవలపైనే ప్రజలు ఆధారపడుతున్నారని, ఇప్పుడు ప్రాణాలను కాపాడే మందుల కొనుగోలు కూడా అదే దారిలో సాగుతోందని ఫార్మసీ వ్యాపారులు అంటున్నారు. అయితే కొన్ని ఆన్లైన్ యాప్స్ అక్రమంగా మందుల విక్రయాలు చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. దీని వల్ల నకిలీ మందులు, డూప్లికేట్ డ్రగ్స్ నేరుగా ప్రజల ఇళ్లకే చేరుతున్నాయని చెబుతున్నారు.
ఈ పరిస్థితి ప్రజారోగ్యానికే కాకుండా లక్షలాది మంది స్థానిక మెడికల్ షాపుల వ్యాపారుల జీవనోపాధిపై కూడా ప్రభావం చూపుతోందని ఫార్మసీ అసోసియేషన్ పేర్కొంది. ఆన్లైన్ ఫార్మసీలకు వ్యతిరేకంగా, స్థానిక రిటైల్ వ్యాపారులను కాపాడాలన్న డిమాండ్తో మే 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్కు పిలుపునిచ్చింది.
రేపు కెమిస్టుల సమ్మె ఉండటంతో, అవసరమైన మందులను ప్రజలు ముందుగానే కొనుగోలు చేసి ఉంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

