టెక్ ప్రపంచంలో కీలక మార్పులకు సంకేతంగా Microsoft తన US వర్క్ఫోర్స్లో సుమారు 7% ఉద్యోగులకు ‘Early Retirement’ ఆప్షన్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం కేవలం ఖర్చులు తగ్గించడం కోసం కాకుండా, సంస్థలో వ్యూహాత్మక మార్పులకు భాగంగా తీసుకున్నదిగా తెలుస్తోంది.

సమాచారం ప్రకారం, వయస్సు మరియు సర్వీస్ కలిపి 70 సంవత్సరాలు పూర్తైన సీనియర్ ఉద్యోగులకు ఈ ఆప్షన్ వర్తించనుంది. మే 7న అర్హులైన ఉద్యోగులకు నోటిఫికేషన్ వెళ్లే అవకాశం ఉంది. ఈ వార్త వెలువడిన వెంటనే మార్కెట్లో Microsoft stock సుమారు 4% పడిపోయినట్లు సమాచారం.Satya Nadella నేతృత్వంలో కంపెనీ ఇప్పుడు AI, సెక్యూరిటీ, క్వాలిటీ రంగాలపై దృష్టి పెట్టుతోంది. గతంలో లే-ఆఫ్స్ జరిగిన తర్వాత, ఇప్పుడు ‘సాఫ్ట్ ఎగ్జిట్’ విధానాన్ని అనుసరిస్తోంది.ఈ నిర్ణయం టెక్ రంగానికి పెద్ద సంకేతంగా మారింది. ఆటోమేషన్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, సంప్రదాయ ఉద్యోగాల భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టెక్ ఇండస్ట్రీ ఇప్పుడు కొత్త ఆపరేటింగ్ మోడల్ వైపు అడుగులు వేస్తోంది.
