పార్వతీపురం మన్యం జిల్లా జయ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వనజ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్యాయత్నం. ముగ్గురు అక్కడికక్కడే మృతి.. ఒకరి పరిస్థితి విషమం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆర్థిక ఇబ్బందులే కారణమా?

ఈ ఘటనలో దంపతులు మరియు వారి చిన్నారి సహా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడిని చికిత్స కోసం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే ఈ దారుణానికి కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు.
