తెగచర్లలో PM శ్రమ యోగి మాన్ ధన్ సదస్సు

February 6, 2026 4:51 PM

అసంఘటిత రంగ కార్మికుల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన్’ (PM-SYM) పథకంపై తెగచర్ల గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. రాపూరు మండల బీజేపీ అధ్యక్షులు దూడల పెంచలయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

జిల్లా లేబర్ ఆఫీసర్లు వై. సత్యనారాయణ, సి.హెచ్. వేణుగోపాల్ ముఖ్య అతిథులుగా హాజరై పథక విశిష్టతను వివరించారు. చిరు వ్యాపారులు, అసంఘటిత కార్మికులు ఈ పథకం ద్వారా వృద్ధాప్యంలో గౌరవప్రదమైన పెన్షన్ పొందవచ్చని తెలిపారు. భవన నిర్మాణ కార్మికులు, వీధి వ్యాపారులు మరియు వివిధ రకాల కూలీలు ఈ పథకానికి అర్హులని, తక్కువ ప్రీమియంతో నెలకు రూ. 3,000 పెన్షన్ పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. అర్హులైన కార్మికులందరూ వెంటనే తమ పేర్లను నమోదు చేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ సామాజిక భద్రతా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, వివిధ రంగాలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media