ఢిల్లీ రాజకీయాల్లో కలకలం రేపుతున్న వార్తలు వెలువడుతున్నాయి. Raghav Chadha ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

రీసెంట్గా పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఆయనను తొలగించడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అలాగే ఎంపీలు Ashok Mittal, Sandeep Pathak సహా మరికొందరు కూడా పార్టీ మారే అవకాశమున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.రాజ్యసభలో పలువురు సభ్యులు ఒకేసారి పార్టీ మారితే ఢిల్లీ రాజకీయాల్లో పెద్ద మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.అయితే ఈ అంశంపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పార్టీ మార్పులపై స్పష్టత రావాల్సి ఉంది.
