పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో మహిళల రిజర్వేషన్ బిల్లుపై తీవ్ర రాజకీయ వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. లోక్సభలో ప్రసంగం ప్రారంభించిన Rahul Gandhi ముందుగా ఒక సరదా వ్యాఖ్యతో సభలో నవ్వులు పూయించారు. “నేను, ప్రధాని ఇద్దరికీ ‘వైఫ్ ఇష్యూ’ లేదు” అంటూ హాస్యంగా వ్యాఖ్యానించారు.
ఆ తరువాత బిల్లుపై తీవ్రంగా స్పందించిన ఆయన, “ఇది మహిళల సాధికారత కోసం కాదు, దేశ ఎన్నికల మ్యాప్ను మార్చే ప్రయత్నం” అని విమర్శించారు. అలాగే ఈ బిల్లు కుల గణన (Caste Census) అంశాన్ని పక్కన పెట్టేందుకు ఉపయోగపడుతోందని ఆరోపించారు. “ఈ బిల్లు రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఉంది” అని కూడా పేర్కొన్నారు.
