ఆంధ్రప్రదేశ్లోని Mopideviలో ఆర్టీసీ డ్రైవర్పై మహిళ దాడి చేసిన ఘటన శుక్రవారం ఉద్రిక్తతకు దారి తీసింది. అవనిగడ్డ నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సును పులిగడ్డ వంతెన వద్ద ఆపకపోవడంతో ఆగ్రహించిన మహిళ, బస్సును వెంబడించి మోపిదేవి ప్రధాన సెంటర్లో ఎక్కి డ్రైవర్ను చెప్పుతో కొట్టింది.
అంతటితో ఆగకుండా, తన బంధువులను చల్లపల్లి బస్ స్టాప్కు పిలిపించి వారితో కలిసి డ్రైవర్పై దాడి చేయించింది. ఈ ఘటనతో బస్ స్టాప్ వద్ద ఆర్టీసీ సిబ్బంది, మహిళ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.సమాచారం ప్రకారం, మహిళకు సంబంధించిన ఒక కానిస్టేబుల్ జోక్యం చేసుకుని వివాదాన్ని పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా సర్దిచేశాడు. ఈ ఘటనపై ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బస్సు ఆపలేదని దాడికి దిగడం సరైన చర్య కాదని అంటున్నారు.ఈ ఘటనపై తదుపరి చర్యలపై స్పష్టత రావాల్సి ఉంది.
