శ్రీశైలం: వేసవి సెలవులు, వరుస సెలవులు కలిసి రావడంతో శ్రీశైలంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. దీంతో శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రోజుల పాటు స్పర్శ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది.
భక్తులు భారీగా తరలివస్తుండటంతో దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ముందుగానే ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే స్పర్శ దర్శనానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.
సామాన్య భక్తులకు సులభంగా దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నాలుగు రోజుల పాటు అలంకార దర్శనానికే అనుమతి ఇవ్వనున్నారు.
భక్తులు తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని, దేవస్థానం ప్రకటించే మార్గదర్శకాలను పాటించాలని అధికారులు సూచించారు.

