నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని నవాబుపేట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న తలారి అంకమ్మ అనారోగ్యంతో మృతి చెందింది.

వివరాల ప్రకారం, ఆమెకు అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఈ నెల 22న ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు చెన్ను తిరుపాల్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అంకమ్మ చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబానికి రూ.10,000 నగదు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా “కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం” అని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కళాశాల సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.
