తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ శుక్రవారం సాయంత్రం చెన్నైలోని లోక్భవన్లో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ను కలిసిన అనంతరం, శనివారం ఉదయం 11 గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మెజారిటీ మార్కు అయిన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను విజయ్ గవర్నర్కు సమర్పించడంతో ఆయనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి లభించింది. 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్, విదుతలై చిరుతైగళ్ కచ్చి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)ల నుండి మద్దతు సమకూరడంతో ఈ కీలక ముందడుగు పడింది. దీంతో ఈ కూటమి 118 మెజారిటీ మార్కును దాటింది.
చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో శనివారం ఉదయం 11 గంటలకు విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం విజయ్ లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకుందని గవర్నర్కు ఆధారాలతో సహా వివరించారు. ఈ మేరకు ఆయా పార్టీల మద్దతు లేఖలను గవర్నర్ కు అందించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానించేందుకు గవర్నర్ సమ్మతి తెలిపారు.
