తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న నటి త్రిష నేరుగా చెన్నై లోని నటుడు విజయ్ ఇంటికి చేరుకున్నారు. పార్టీకి అనుకూలంగా బలమైన తొలి ట్రెండ్లు వెలువడుతున్న నేపథ్యంలో, నటి త్రిష కృష్ణన్ తమిళగ వెట్రి కజగం అధినేత విజయ్ నివాసానికి చేరుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల పోరులో టీవీకే ప్రస్తుతం 234 స్థానాలకు గాను 107 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం, పార్టీకి ఊపునిస్తోంది. బలమైన రాజకీయ శక్తిగా నటుడు విజయ్ మొదటిసారి ఎన్నికల్లోనే నిలిచాడు.
పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తొలి ఆరు విడతల ఓట్ల లెక్కింపు పూర్తికాగా టీవీకే అధినేత విజయ్, డీఎంకేకు చెందిన ఆర్.డి. శేఖర్పై తన ఆధిక్యాన్ని మరింత పెంచుకున్నారు. ఇంకా మరో 16 విడతల లెక్కింపు జరగాల్సి ఉంది. పెరంబూర్లో ఆరు విడతల లెక్కింపు పూర్తయ్యేసరికి విజయ్ 13,500 ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉండగా, దాదాపు 21,000 ఓట్లు సాధించిన ఆర్.డి. శేఖర్ రెండో స్థానంలో నిలిచారు.
