ఐపీఎల్లో రికార్డు ప్రదర్శనతో అందరి దృష్టి ఆకర్షించిన యువ బ్యాటర్
ప్రతిభ ముందు ఎంపిక సమస్యలు అడ్డంకి కావని వ్యాఖ్య
భారత్: భారత్ యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఇక జాతీయ జట్టులో అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ అభిప్రాయపడ్డారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అతడు చూపిన ప్రదర్శన అంతర్జాతీయ క్రికెట్కు సరిపోతుందని స్పష్టం చేశారు.
ఐసీసీ రివ్యూ కార్యక్రమంలో సంజనా గణేశన్తో మాట్లాడిన నాసిర్ హుస్సేన్, ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ చేసిన పరుగుల వర్షాన్ని ప్రశంసించారు.
ఈ సీజన్లో 16 మ్యాచ్ల్లో 776 పరుగులు చేసిన వైభవ్, 237.30 స్ట్రైక్రేట్తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధికంగా 72 సిక్సర్లు బాదిన బ్యాటర్గా కూడా నిలిచాడు.
“అతడు భారత జట్టులో ఆడాలా లేదా అనే ప్రశ్నకు సమాధానం చాలా సులభం. అవును.. అతడు తప్పకుండా ఆడాలి. నేను మొత్తం ఐపీఎల్ను ఎక్కువగా చూడలేదు. కానీ వైభవ్ బ్యాటింగ్ వీడియోలు చూశాను.
అతడు అసాధారణ ప్రతిభ కలిగిన ఆటగాడు” అని నాసిర్ హుస్సేన్ చెప్పారు.
సచిన్ను గుర్తు చేసిన వైభవ్
వైభవ్ సూర్యవంశీపై సచిన్ టెండూల్కర్ చేసిన ప్రశంసలు తనకు పాత జ్ఞాపకాలను గుర్తు చేశాయని నాసిర్ తెలిపారు.
“ఇంగ్లండ్ తరఫున నేను ఆడిన తొలి టోర్నీల్లో నెహ్రూ కప్ ఒకటి. అప్పుడొక యువ ఆటగాడు కొత్త తరహా ప్యాడ్లు ధరించి బ్యాటింగ్కు వచ్చాడు.
అతని పేరు సచిన్ టెండూల్కర్. అతడిని చూసి నేను ఆశ్చర్యపోయాను” అని గుర్తు చేసుకున్నారు.
సచిన్ ఇటీవల వైభవ్ బ్యాట్ స్వింగ్ను ప్రశంసించారని, అలాంటి దిగ్గజాన్ని ఆకట్టుకోవడం చిన్న విషయం కాదన్నారు.
“సచిన్ టెండూల్కర్ను ఆకట్టుకుంటే అది చాలా పెద్ద విషయం. విరాట్ కోహ్లీ సహా ఎంతోమంది మాజీ, ప్రస్తుత క్రికెటర్లను అతడు మెప్పించాడు. అందుకే అతడి ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు” అని వ్యాఖ్యానించారు.
ఎంపికదారుల ముందున్న అసలు సవాల్
వైభవ్కు అవకాశం ఇవ్వాలన్న విషయంలో పెద్దగా సందేహం లేదని, కానీ భారత జట్టులో ఎవరిని తప్పించాలన్నదే ప్రధాన సమస్య అని నాసిర్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం టీ20 జట్టులో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లు అగ్రస్థానాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయినప్పటికీ అసాధారణ ప్రతిభ కలిగిన ఆటగాడికి చోటు కల్పించాల్సిందేనన్నారు.
“ప్రపంచంలోని మరే జట్టులో అయినా అతడిని వెంటనే తీసుకునేవారు. కానీ భారత జట్టులో పోటీ చాలా ఎక్కువ.
.
Also Read

