తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు Vem Narender Reddy టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ Mahesh Kumar Goud ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు వేం నరేందర్ రెడ్డిని శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎంపికైన వేం నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీ ఫారం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్, విజయరమణ రావు, గండ్ర సత్యనారాయణ, చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
