నేషనల్ హైవే 216E అలైన్మెంట్ మార్చాలంటూ ఇందుపల్లి, నడిపూడి, పేరూరు గ్రామస్తులు జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. కొత్త అలైన్మెంట్ వల్ల తమ ఇళ్లు, పంట పొలాలు కోల్పోతున్నామని.. 2021లో ఇచ్చిన పాత అలైన్మెంట్ ప్రకారమే హైవే నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు DRO మాధవికి వినతి పత్రం అందజేసి, తమ గోడును వెళ్లబోసుకున్నారు.
NH 216E అలైన్మెంట్ మార్చాలని బాధితుల ఆందోళన మా ఇళ్లు కాపాడండి.. కలెక్టరేట్ వద్ద ఇందుపల్లి గ్రామస్తుల నిరసన. పాత అలైన్మెంట్ ప్రకారమే హైవే నిర్మించాలని డిమాండ్. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాధితుల వినతి.
