50 ఏళ్ల అప్పన్న ఆచూకీ కోసం Coast Guard, Navy, Marine Police సంయుక్త ఆపరేషన్
పడవ నుంచి సముద్రంలో పడిపోయిన అప్పన్న
Vizag : విశాఖపట్నం తీరంలో 50 ఏళ్ల మత్స్యకారుడు అప్పన్న సముద్రంలో పడి గల్లంతయ్యారు. గురువారం ఈ ఘటన జరిగినట్లు Marine Police అధికారులు తెలిపారు.
ఆగస్టు 16న ఎనిమిది మంది సిబ్బందితో కూడిన మత్స్యకారుల బృందం సముద్రంలోకి వెళ్లింది.
గురువారం తెల్లవారుజామున 1 గంట సమయంలో తిరిగి వస్తుండగా అప్పన్న పడవ వెనుక భాగంలోకి వెళ్లారు.
చేపలను నిల్వ చేసేందుకు ఉపయోగించే ఉప్పు తీసుకురావడానికి ఆయన అక్కడికి వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
అప్పన్న అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికే మిగతా మత్స్యకారులకు సముద్రంలో ఏదో పడిన శబ్దం వినిపించింది. వెంటనే వెనుకకు వెళ్లి చూడగా అప్పన్న కనిపించలేదు.
11 నాటికల్ మైళ్ల దూరంలో గాలింపు
విశాఖపట్నం తీరానికి సుమారు 11 నాటికల్ మైళ్ల దూరంలో అప్పన్న పడవ నుంచి సముద్రంలో పడిపోయినట్లు అధికారి తెలిపారు.
పడవ యజమాని సోదరుడు అర్ధరాత్రి సమయంలో అధికారులకు సమాచారం అందించారు. దీంతో Coast Guard, Navy సంయుక్తంగా గాలింపు చర్యలు ప్రారంభించాయి. ప్రస్తుతం గాలింపు కొనసాగుతున్నప్పటికీ అప్పన్న ఆచూకీ ఇంకా లభించలేదు.
మిగతా మత్స్యకారులు కూడా సముద్రంలోనే ఉండి అధికారులు చేపడుతున్న గాలింపు చర్యలకు సహకరిస్తున్నారు.
గాలింపు ముమ్మరం చేయాలని V Anitha ఆదేశం
అప్పన్నను గుర్తించేందుకు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని State Home Minister V Anitha Fisheries Department, Marine Police, Coast Guard అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాలు సమన్వయంతో విస్తృతంగా గాలించాలని సూచించారు.
ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న Anitha.. మిగతా మత్స్యకారుల పరిస్థితిపై కూడా ఆరా తీశారు.
అప్పన్నను సురక్షితంగా గుర్తించి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించాలని అధికారులను ఆదేశించారు.
చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు మరింత జాగ్రత్తగా ఉండాలని Anitha సూచించారు.
బాధిత మత్స్యకారుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. గాలింపు చర్యలను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు.



