ఏప్రిల్ 2026తో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు కీలక మలుపు వద్ద నిలిచాయి. రాబోయే ఎన్నికల నేపథ్యంలో టీఎంసీ 226 సీట్ల లక్ష్యంతో క్లీన్ స్వీప్పై దృష్టి సారించగా, బీజేపీ 170 సీట్ల టార్గెట్తో గట్టి పోటీ ఇస్తోంది.

ఈ ఎన్నికలు కేవలం రాజకీయ పోటీ కాకుండా ‘మమతానామిక్స్’పై ఒక రిఫరెండంగా మారాయి. సంక్షేమ పథకాల ద్వారా పేదలకు మద్దతు పెరిగినా, పారిశ్రామిక అభివృద్ధి మందగించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.గణాంకాల ప్రకారం, 1960లో భారత జీడీపీలో బెంగాల్ వాటా 10.5% ఉండగా, ప్రస్తుతం 5.6%కి పడిపోయింది. రాష్ట్రంలో వ్యక్తిగత ఆదాయం కూడా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తగ్గింది. సంక్షేమ పథకాలపై అధిక దృష్టి, పారిశ్రామిక పెట్టుబడుల కొరత కారణంగా ఆర్థిక స్థబ్దత ఏర్పడిందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదే అంశాన్ని బీజేపీ ప్రధాన ఆయుధంగా ఉపయోగిస్తూ ‘డబుల్ ఇంజిన్ గ్రోత్’ నినాదంతో యువతకు ఉద్యోగాల హామీ ఇస్తోంది. మరోవైపు, లక్ష్మీర్ భండార్ వంటి పథకాలతో మహిళల ఓటు బ్యాంక్ను టీఎంసీ బలోపేతం చేసుకుంది. మైనారిటీ ఓట్లు, బెంగాలీ గర్వం కూడా మమతా బెనర్జీకి బలంగా నిలుస్తున్నాయి.విశ్లేషణ ప్రకారం, కీలక స్వింగ్ సీట్లలో టీఎంసీ ఆధిపత్యం కొనసాగితే మమతా బెనర్జీ నాలుగోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఫలితాలు ఏవైనా, కొత్త ప్రభుత్వం ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడం పెద్ద పరీక్షగా మారనుంది.
