వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి Y. S. Jagan Mohan Reddy వ్యక్తిగత పర్యటన నిమిత్తం యూరప్ వెళ్లనున్నారు. శనివారం అర్ధరాత్రి బెంగళూరు నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రయాణం ప్రారంభించనున్నారు.

ఈ పర్యటన సుమారు రెండు వారాల పాటు కొనసాగనున్నట్లు సమాచారం. వ్యక్తిగత కార్యక్రమాల కోసం ఈ విదేశీ టూర్ ప్లాన్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
