తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిన భక్తులు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. గత కొద్ది నెలలుగా కొనసాగుతున్న రద్దీకి వేసవి సెలవుల ప్రభావం కూడా తోడవడంతో శ్రీవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ నెల రెండో వారం నుంచి పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కానుండటంతో ముందుగానే స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవాలని వేలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు.
ప్రస్తుతం రోజుకు 80 వేల మందికిపైగా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. భక్తుల సంఖ్య పెరుగుతున్నా దర్శనం త్వరగా పూర్తయ్యేలా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
సిఫార్సు లేఖలకు తాత్కాలిక నిలిపివేత
భక్తుల రద్దీ దృష్ట్యా జులై 15 వరకు సిఫార్సు లేఖలపై ఇచ్చే దర్శనాలను టీటీడీ నిలిపివేసింది. సాధారణ భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ దర్శన ఏర్పాట్లు కొనసాగిస్తోంది. శ్రీవారి అభిషేకం సమయంలో కూడా సామాన్య భక్తులను ఆలయంలోకి అనుమతిస్తోంది.
క్యూ కాంప్లెక్స్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీరు, అన్నప్రసాదం, వైద్య సేవలు, వసతి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు.
టీటీడీ సిబ్బందికి భక్తులు సహకరించాలని కూడా కోరుతున్నారు.
రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఆదాయం
భక్తుల రద్దీ పెరుగుతుండటంతో తిరుమల శ్రీవారి ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. హుండీ ఆదాయం, లడ్డూ ప్రసాదాల విక్రయాలు, తలనీలాల సమర్పణలు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి.
గత కొన్ని వారాలుగా తిరుమలలో రోజువారీ ఆదాయం కోట్ల రూపాయల్లో కొనసాగుతోంది.
భక్తుల సంఖ్య పెరిగినా సేవల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రద్దీ రోజుల్లో అదనపు సిబ్బందిని కూడా వినియోగిస్తున్నారు.
24 గంటల సర్వదర్శనం
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల క్యూ లైన్ బయట శిలాతోరణం వరకు విస్తరించింది.
ప్రస్తుతం సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.
టైమ్స్లాట్ దర్శనం పొందే భక్తులకు సుమారు ఏడు గంటల సమయం పడుతోంది. శీఘ్ర దర్శనం టోకెన్లు ఉన్న భక్తులు మూడు నుంచి నాలుగు గంటల్లో స్వామివారిని దర్శించుకుంటున్నారు.
ఒక్కరోజులో 93 వేల మందికి పైగా దర్శనం
నిన్న ఒక్కరోజే 93,230 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 41,754గా నమోదైంది. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.83 కోట్లకు చేరింది.
అదే రోజు లడ్డూ ప్రసాదాల విక్రయాలు 4.22 లక్షలకు చేరుకున్నాయి. అన్నప్రసాదాన్ని 3.12 లక్షల మంది భక్తులు స్వీకరించారు. ఈ గణాంకాలు తిరుమలలో భక్తుల రద్దీ ఏ స్థాయిలో ఉందో స్పష్టంచేస్తున్నాయి.
విద్యాసంస్థలు ప్రారంభమయ్యేలోపు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు.
బోయే రోజుల్లో కూడా ఇదే స్థాయిలో రద్దీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read



