ఏడాదిలో తొలి విదేశీ పర్యటనకు షీ ప్రాధాన్యం

June 8, 2026 12:29 PM
Chinese President Xi Jinping and North Korean leader Kim Jong Un during a ceremonial welcome in Pyongyang.

గత కొన్నేళ్లుగా తొలి పర్యటనలతో దౌత్య సంకేతాలు

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సాధారణంగా ఏడాదికి మూడు నుంచి నాలుగు సార్లు విదేశీ పర్యటనలు చేస్తుంటారు. అయితే ప్రతి ఏడాది ఆయన చేసే తొలి విదేశీ పర్యటనపై ప్రత్యేక దృష్టి ఉంటుంది.

ఆ పర్యటన ద్వారా బీజింగ్‌ ఆ ఏడాదికి నిర్దేశించుకున్న దౌత్య ప్రాధాన్యాలపై సంకేతాలు వెలువడుతుంటాయి.

ఇటీవలి సంవత్సరాల్లో షీ తొలి విదేశీ పర్యటనలు ఇలా ఉన్నాయి:

  • 2022లో కరోనా మహమ్మారి కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత షీ సెప్టెంబరులో కజకిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌లను సందర్శించారు.
  • ఇది మధ్య ఆసియా దేశాలతో చైనా సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా తీసుకున్న అడుగుగా భావించారు.
  • 2023లో షీ తొలి విదేశీ పర్యటన రష్యాకు జరిగింది. ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత మాస్కోకు ఆయన చేసిన తొలి పర్యటన అదే.
  • 2013 నుంచి ఇప్పటివరకు షీ రష్యాను 11 సార్లు సందర్శించారు. ఇతర ఏ దేశానికన్నా ఎక్కువసార్లు వెళ్లింది రష్యాకే.
  • 2024లో మే నెలలో యూరప్‌లోని ఫ్రాన్స్‌, సెర్బియా, హంగేరీ దేశాల పర్యటనతో ఆయన విదేశీ ప్రయాణాలను ప్రారంభించారు. ఉక్రెయిన్‌ యుద్ధం,
  • వాణిజ్య వివాదాల కారణంగా యూరప్‌తో చైనా సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న సమయంలో ఈ పర్యటన జరిగింది.
  • 2025లో ఏప్రిల్‌లో వియత్నాం, మలేషియా, కంబోడియా దేశాల పర్యటనతో షీ తన తొలి విదేశీ పర్యటనను ప్రారంభించారు.
  • పొరుగు దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరంపై ఉన్నత స్థాయి పార్టీ సమావేశంలో ప్రస్తావించిన వారం రోజుల్లోనే ఈ పర్యటన చేపట్టారు.

ప్యాంగ్యాంగ్‌లో ఘన స్వాగతం

కిమ్‌ జోంగ్‌ ఉన్‌ దంపతుల స్వాగతం

షీ జిన్‌పింగ్‌, ఆయన సతీమణి పెంగ్‌ లియువాన్‌ కారులో ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లోని కిమ్‌ ఇల్‌ సంగ్‌ స్క్వేర్‌కు చేరుకున్నారు.

అక్కడ సైనిక బ్యాండ్‌, భారీ సంఖ్యలో చేరిన ప్రజలు వారికి స్వాగతం పలికారని చైనా అధికార వార్తా సంస్థ సిన్హువా తెలిపింది.

షీ దంపతులకు ఉత్తర కొరియా నాయకుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌, ఆయన భార్య రీ సోల్‌ జు స్వాగతం పలికారు.

కార్యక్రమ ప్రాంగణంలో “ఉత్తర కొరియా-చైనా శాశ్వత స్నేహం”, “ఉత్తర కొరియా-చైనా అచంచల ఐక్యత చిరంజీవి” అనే నినాదాలతో బ్యానర్లు ఏర్పాటు చేశారు.

అనంతరం షీ, ఉత్తర కొరియా సైన్యానికి చెందిన గౌరవ వందన దళాన్ని పరిశీలించారు. ఆ సందర్భంగా సైనికులు కొరియన్‌ భాషలో “కామ్రేడ్‌ షీ జిన్‌పింగ్‌కు మంచి ఆరోగ్యం కలగాలి” అంటూ నినాదాలు చేశారు.

సిన్హువా విడుదల చేసిన దృశ్యాల్లో కార్యక్రమానికి హాజరైన ప్రజలు ఉత్సాహంగా స్పందించినట్లు కనిపించింది.చిన్నారులు ఆనందంతో ఎగిరి గంతులు వేయగా, ప్రజలు చైనా, ఉత్తర కొరియా జెండాలు, పుష్పగుచ్ఛాలు ఊపుతూ స్వాగతం పలికారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media