9 రౌండ్లలో 8.5 పాయింట్లు.. ఒక్క ఓటమి కూడా లేదు
547 మంది క్రీడాకారుల్లో అగ్రస్థానం.. ₹50,000 నగదు బహుమతి
హైదరాబాద్: తెలంగాణకు చెందిన చెస్ క్రీడాకారుడు Raj kumar నాగ్పూర్లో జరిగిన 6వ ఆల్ ఇండియా FIDE-రేటెడ్ Below-1700 చెస్ టోర్నీలో విజేతగా నిలిచారు. తొమ్మిది రౌండ్లలో 8.5 పాయింట్లు సాధించి ఒక్క ఓటమి కూడా లేకుండా టోర్నీని పూర్తి చేశారు.
547 మంది క్రీడాకారుల్లో అగ్రస్థానం
ఈ టోర్నీలో మొత్తం 547 మంది పాల్గొన్నారు. వారందరిలో రాజ్కుమార్ అత్యుత్తమ ప్రదర్శనతో తొలి స్థానాన్ని సాధించారు. విజేతగా నిలిచిన ఆయనకు ₹50,000 నగదు బహుమతి లభించింది.
TSWREIS పూర్వ విద్యార్థి
రాజ్కుమార్ TSWREIS పూర్వ విద్యార్థి. ప్రస్తుతం ఆయనకు షేక్పేట్ చెస్ అకాడమీలో శివకుమార్ శిక్షణ ఇస్తున్నారు. రాజ్కుమార్ సిర్పూర్లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నారు.
అభినందనలు తెలిపిన డా. రామ లక్ష్మణ్
రాజ్కుమార్ సాధించిన విజయంపై తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ & జూనియర్ కాలేజీల PDs, PETs అసోసియేషన్ చైర్మన్ డా. రామ లక్ష్మణ్తో పాటు పలువురు అభినందనలు తెలిపారు.



