ఇంజిన్లో షార్ట్సర్క్యూట్తో మంటలు, దట్టమైన పొగ
గోల్లపూడి వద్ద APSRTC బస్సు ఆపిన డ్రైవర్.. సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు
విజయవాడ: జగ్గయ్యపేట నుంచి విజయవాడకు వస్తున్న APSRTC బస్సులో శనివారం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బస్సు ఇంజిన్లో షార్ట్సర్క్యూట్ కావడంతో మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు రావడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
ప్రమాదాన్ని వెంటనే గుర్తించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించారు. గోల్లపూడి సమీపంలో బస్సును రోడ్డుపక్కన నిలిపి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
APSRTC బస్సులో మంటలు.. కిటికీల్లోంచి దూకిన ప్రయాణికులు
బస్సులో మంటలు, పొగలు కనిపించడంతో కొందరు ప్రయాణికులు వెంటనే కిందకు దిగిపోయారు. మరికొందరు ప్రాణభయంతో కిటికీల్లోంచి బయటకు దూకారు. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న అధికారులు, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం.
బస్సులో మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇంజిన్లో విద్యుత్ లోపం కారణంగా షార్ట్సర్క్యూట్ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.
Also Read

