నేటి సమాజానికి స్ఫూర్తినిచ్చిన గొప్ప తరం క్రమంగా కనుమరుగవుతోందనే భావోద్వేగ సందేశం సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు “నేను” అనే భావన కంటే “మనం” అనే విలువతో జీవించిన తరం, సాదాసీదా జీవనశైలిలో ఆనందాన్ని కనుగొన్న తరం నేడు అరుదైపోతుందని పేర్కొంటున్నారు.
అన్నం తినేముందు ఇతరుల ఆకలిని గుర్తించిన ఆ తరం, సాంకేతికత లేకుండానే జ్ఞానం సంపాదించి, క్రమశిక్షణతో జీవించి, కుటుంబ బంధాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, పరస్పర గౌరవం, నిజాయితీ వంటి విలువలను పాటిస్తూ సమాజానికి మార్గదర్శకంగా నిలిచింది.ఆడంబరాలకు దూరంగా, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటూ, త్యాగాలతో పిల్లల భవిష్యత్తుకు పునాది వేసిన ఆ తరంలోని వ్యక్తులు ఒక్కొక్కరుగా దూరమవుతుండటంతో, సమాజం ఒక విలువైన సంపదను కోల్పోతుందనే ఆవేదన వ్యక్తమవుతోంది.ఈ తరం విలువలను నేటి యువత అలవర్చుకోకపోతే భవిష్యత్తు అంధకారమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
