హైదరాబాద్‌లో విషాదం.. నాగారంలో పీజీ వైద్య విద్యార్థిని మృతి

July 25, 2026 3:42 PM
PG medical student Dikshita in Hyderabad Nagaram incident.

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత.. వారం క్రితమే హైదరాబాద్‌కు రాక
తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కీసర పోలీసులు.. కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది

హైదరాబాద్‌: నాగారం ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ భవనం టెర్రస్ నుంచి దూకినట్లు అనుమానిస్తున్న 26 ఏళ్ల PG Medical Student చికిత్స పొందుతూ మృతి చెందింది.

మృతురాలు దీక్షిత (26). ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేసి, బెంగళూరులోని Siddhartha Medical Collegeలో పీజీ వైద్య విద్య అభ్యసిస్తోంది.

వారం క్రితం ఆమె హైదరాబాద్‌కు వచ్చి నాగారంలోని వెస్ట్ గాంధీ నగర్‌లో తల్లిదండ్రులతో ఉంటోంది.

పోలీసుల వివరాల ప్రకారం, శుక్రవారం సాయంత్రం దీక్షిత అపార్ట్‌మెంట్ టెర్రస్‌కు వెళ్లి అక్కడి నుంచి దూకినట్లు అనుమానిస్తున్నారు.

తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

దీక్షిత స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైలారం గ్రామం. తర్వాత ఆమె కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది.

దీక్షిత తండ్రి ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కీసర పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media